Rago
Book information
Description
Rago is a Telugu novel written by a Maoist underground activist. తెలుగు సాహిత్యంలో స్ర్తీవాద ఉద్యమం ఇరవయ్యో శతాబ్దంలో వచ్చింది. తెలుగులో ఈ వాదం పాశ్చాత్య ప్రభావంతో వచ్చిందన్నది నిర్వివాదం. తెలుగులో నన్నయ నుండి మొదలుపెడితే నేటి వరకు- ఏదో ఒక రకంగా స్ర్తీల చిత్రణ జరుగుతూనే ఉంది. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు మొదలైన అన్ని ప్రక్రియలు స్ర్తీకి సముచితమైన స్థానాన్ని ఇచ్చాయి. తొలిదశ సాహిత్యంలో గిరిజనుల స్థితిగతులను పరిశీలించాలను కునేటప్పుడు పూర్వపరాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది. గిరిజన స్ర్తీల ప్రస్తావన గురించి ప్రాచీనకాలం నుండి చూస్తే, భారతంలో ‘హిడింబి’, రామాయణంలో ‘శబరి’ మొదలైన గిరిజన స్ర్తీల పాత్రలు కనిపిస్తుంటాయి. మధ్యయుగ భారత దేశంలో సమ్మక్క, సారక్క, రాణి దుర్గావతి వంటి గిరిజన స్ర్తీలు రాజ్యాల్ని పాలించిన దాఖాలాలు ఉన్నాయి. అలాంటి గిరిజన స్ర్తీలు ఆధునిక కాలం వచ్చేసరికి ఎటువంటి చట్రంలో మునిగిపోయారనే అంశాన్ని చరిత్ర వివరి స్తోంది. సాధన రాసిన ‘రాగో’ నవలలో గిరిజన స్ర్తీ ఎటువంటి బాధలకు గురవుతోందో వివరించే ప్రయత్నం జరిగింది.సాధన రెండు నవలలు రాశాడు. అందులో ఒకటి ‘సరిహదు’్ద, రెండు ‘రాగో’. రాగో నవల 1993లో ప్రచురితమైంది. గోండుల సంస్కృతి సంప్రదాయలలో గిరిజన స్ర్తీ పడే అవస్థలు, ఉద్యమ పోరాటంలో గిరిజనుల బతుకును చిత్రించిది ఈ నవల. రాగో యుక్త వయస్కురాలైన (మాడియా) గోండు యువతి. రాగో తల్లిదండ్రులు- ఆమె మేనమామ కొడుకు ‘సంఘె’తో పెళ్ళికి ఒప్పుకుంటారు. కాని రాగోకి ఆ పెండ్లి ఇష్టం లేదు. అదే ఊరిలో ‘నాన్సు’ అనే వ్యక్తిని ప్రేమిస్తుంటుంది. కానీ ఆ సంబంధాన్ని రాగో తల్లిదండ్రులు ఒప్పుకోరు. రాగో తనకు ఇష్టంలేని పెండ్లి చేసుకోవడం కంటే అడవు ల్లోకి వెళ్ళి బతకడం మేలని భావించుకొని ఇంటినుండి పారిపోతుంది. ఆ క్రమంలో అన్నలతో పరిచయం అవుతుంది. అప్పటి వరకు తాను గిరిజన సమాజంలో చూసిన తారతమ్యాలు బయట సమాజంలో కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతుంది.వెంటనే రాగో ఎలాగైనా గిరిజనుల్లో ఉన్న మూఢ వ్యవస్థను, అమాయకత్వాన్ని నిర్మూలించి, చైతన్యాన్ని తేవాలని అనుకుంటుంది. ఆ ఆశతోనే దళంలో కలిసి స్వల్ప వ్యవధిలోనే పై స్థాయికి ఎదుగుతుంది. అనేక గిరిజన గుడారాలు తిరిగి వాళ్ళల్లో్ల మార్పు తెస్తుంది. ఆ మార్పుకు తన జీవితాన్నే ప్రతీకగా చూపిస్తుంది. చివరికి ఆమె తండ్రి కూడా రాగో- పార్టీ సభ్యత్వాన్ని ఆమోదిందచడంతో నవల ముగుస్తుంది. సమాజంలో, కుటుంబంలో స్ర్తీల అణిచివేతను ఖండిస్తూ, లైంగిక పరంగా తమను తక్కువగా చూడటాన్ని నిరసిస్తూ స్ర్తీ విముక్తి కోసం- నేటి విధానాలలోని లోపాలను రూపు మాపడానికి స్ర్తీ, పురుషులు చేపట్టిన వినూత్న మార్గమే స్ర్తీవాదం. స్ర్తీవాదంలో మూడు ప్రధానమైన ధోరణులు కనిపిస్తాయి. అవి లిబరల్ ఫెమినిజమ్, రాడికల్ ఫెమినిజమ్, సోషలిస్టు ఫెమినిజం. ఈ మూడు ప్రధాన ధోరణుల్లో స్ర్తీవాద సాహిత్యాన్ని పరిశీలిస్తున్నారు.‘రాగో’ నవలలో, రాగో గోండు స్ర్తీ. గోండు భాషలో రాగో అంటే రామచిలుక. పంజరంలో ఉన్న చిలుక. పంజరంలో ఉన్న రామచిలుక స్వేచ్ఛ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూంటుంది. ఈ నవలలో రాగో అనే మాడియా గోండి స్ర్తీ కూడా స్వేచ్ఛకోసం చూసి చూసి, చివరికి తానే ధైర్యం తెచ్చుకొని జనజీవన స్రవంతిలోకి వెళ్ళిపోతుంది. అందుకే రచయిత రాగోను పంజరంలో చిలుకకు సంకేతంగా చిత్రించాడని తెలుస్తుంది. గిరిజన స్ర్తీకి స్వేచ్ఛ రోజు రోజుకీ కనుమరుగై పోతూ ఉంది. గిరిజనులు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పాటిం చడం వల్లే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది.గిరిజన స్ర్తీకి ఎదురవుతున్న పరిస్థితులను ఒకసారి అవలోకనం చేస్తే, మొదట ఎదురయ్యే సమస్య విద్య లేకపోవడం. గిరిజనులు అడవుల్లోనే జీవించడం వల్ల విద్యకు అంతగా ఆసక్తి చూపరు. అవకాశాలూ తక్కువ. చదువుకోవాలనే ఆసక్తి చూపినా కేవలం పురుషులకు మాత్రమే విద్య అందుబాటులో ఉంటుంది. గిరిజనులు స్ర్తీ విద్యను నిరాకరించడానికి కొన్ని కారణాలు కనిపిస్తుంటాయి. స్ర్తీ చదువుకుంటే కూలికి వెళ్ళేదెవరని, పైగా స్ర్తీలు చేతికింద ఉంటే అనేక పనుల్లో సహాయపడతారని కుటుంబం భావించుకుంటుంది. అదొక కారణం అయితే, మరొక కారణం స్ర్తీలు చదువుకుంటే, చదువుకున్న వ్యక్తికే ఇచ్చి పెళ్ళిచేయాల్సి ఉంటుంది. అంత వరకట్నం ఇవ్వలేమనే ఉద్దేశంతో స్ర్తీలను చదివించడం పట్ల ఆసక్తి చూపరు.అలాగే గిరిజనులు సమాజానికి కొంత దూరంగా ఉండడం, చదువు వల్ల కలిగే ప్రయోజనాలు తెలియకపోవడం కూడా ఒక కారణం. గిరిజన స్ర్తీ వరకట్నానికో, ఓలికో అంగడి వస్తువై బాల్యవివాహమనే చట్రంలో ఇరుక్కుంటుంది. అందుకే రాగో నవలలో- రాగోకి ఇష్టంలేని పెళ్ళి చేయదలిచిన రాగో తండ్రి దల్సు కి రాగో తగిన బుద్ధి చెప్తుంది. గిరిజనుల్లో స్ర్తీల అభిప్రాయాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. రాగో నవలకు మూల కారణం మాడియా కులంలో ఆచరిస్తున్న లామడే (ఇల్లరికం). రాగో తండ్రి దల్సు- రాగో కోసం సంఘెని- లామడేగా పెట్టుకుంటాడు. దల్సు అంటే రాగోకు ఇష్టముండదు. కాని నిర్ణయించిన సాంప్రదాయానికి, లేక కులాచారాల కట్టుబాట్ల వల్ల వీరిద్దరికీ పెళ్ళి చేయాలని నిర్ణయిస్తారు.దాంతో స్ర్తీ మనస్సును తెలుసుకోకుండానే అనేక పనులు జరిగిపోతున్నాయని అర్థమౌతుంది. రాగో అనుకున్నట్టు తనను వేరే వాడితోనో, లేక తాను ప్రేమించిన వ్యక్తితోనో పెండ్లి జరిపిస్తే తన తండ్రికి పోయేదేమిటని ప్రశ్నించుకుంటుంది. కానీ, అలా జరగలేదు. పూర్వం కాలం నుండి పితృస్వామ్య వ్యవస్థలో స్ర్తీ పడే బాధల గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. గిరిజనుల్లో కూడా పితృస్వామ్య వ్యవస్థలో స్ర్తీలు పడే బాధలకు నిదర్శనంగానే రాగో కనిపిస్తుంది. ఈ నవలల్లో రాగో వేసుకున్న ప్రశ్నలు గిరిజన స్ర్తీకే కాకుం డా, సమస్త లోక స్ర్తీల కందరికి సంబంధించిన సమస్యలుగా పరిగణించాల్సిన అవసరంఉంది. నాగరిక సమా జంలో ఉండే స్ర్తీలకి, గిరిజన సమాజంలో ఉండే స్ర్తీలకి మధ్య వారధిగా రాగో చిత్రితమయింది. అందుకే స్ర్తీకి కూడా హృదయం ఉంటుందని గమనించాలనేది రాగో బాధ.సైమన్ డి బొవియర్ ‘పుట్టుకతోనే ఎవరూ ఆడవాళ్ళు కారు, పుట్టిన తరువాత ఆడవాళ్ళుగా తయారవుతారు’ అని వివరించారు. మాడియా మహిళ తరతరాలుగా అనుభవిస్తున్న ఈ చిత్రహింసలకు తెల్లారేదెప్పుడు అనేది- ఆనాటికి రాగోకు అర్థం కాని, పరిష్కారం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. గోండు కులంలో స్ర్తీలకు బహిష్టు సమస్య పెద్ద గుదిబండగా మారింది. ఆ ఐదు రోజులు ఎవరికి కనబడరాదు, ఎవరిని ముట్టుకోవద్దు. ఆ పరిస్థితిలో స్ర్తీని పట్టించుకునే వాళ్ళే కరవవు తుంటారు. తనను కన్న తల్లి కూడా ఆ ఆచారాన్ని జవదాట వద్దంటుంది. దీని మీద గోపి భాగ్యలక్ష్మి ‘జంగుబాయి’ కథ అద్భుతంగా చిత్రించారు. వర్షాలు పడినా, విపరీతమైనా ఎండలు కొట్టినా ఆ స్ర్తీకి గూడెంకు దూరంగా, తన కుటుంబానికి దూరంగా ఐదు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఈ గోండు సంప్రదాయంలో ఉంది.ప్రాచీన కాలం కంటే ఆధునిక కాలంలో స్ర్తీలకు అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక రకంగా గిరిజనేతరుల చేతిలోనో లేదా, దారి దోపిడీ వాళ్ళ చేతిలోనో గిరిజన స్ర్తీ మోసపోతున్న సంఘటనలు కోకొల్లలు. ఏ విషయంలోనైనా గిరిజన స్ర్తీ చిన్నచూపుకే గురవుతోంది. అందుకే స్ర్తీవాద సాహిత్యం వచ్చాక ‘ఆకాశంలో సగం’ అనే సాహిత్య పోరాటం ప్రారంభమైంది. ఈ విధానం గిరిజన సమాజంలో ఇంకా బలంగా పుంజుకోలేదు. గిరిజనులు కూడా మారాలి. తమ ఆచారాల్లో మార్పులు తెచ్చుకోవాలి. లేకపోతే ఆ ఆచారాలను విడవాల్సిన అవసరం ఉంది. స్ర్తీని కేవలం అంగడి వస్తువుగానో, లేక ముడిసరుకుగానో చూడడం ఇక కుదరదు. స్ర్తీ కూడా మన లాంటి మనిషేనన్న భావన కలగాలి. అది గిరిజనుల్లో తప్పనిసరిగా, పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.రాగో ఇంటి నుండి పారిపోయి వచ్చిన తరువాత అడుగడుగున ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆ బాధను భరించలేకే అన్నల్లో కలిసిపోయింది. రాగో జనజీవన స్రవంతిల్లోకి వచ్చిన తరువాత ‘జైని’ గా పేరు మార్చుకోని గోండు కులంలో మూఢాచారాలను, సంప్రదాయాలను నిర్మూలించడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే గోండు స్ర్తీలకు అనేక విద్యలు నేర్పింది. మహిళా సంఘాలను పెట్టించింది. రాగో ద్వారా గోండు స్ర్తీలలో కొంతమేరకైనా స్వేచ్ఛ, చైతన్యం వచ్చాయి. స్ర్తీ కేవలం వంటింటికే పరిమితమైపోదని రాగో నిరూపించింది. డిప్యూటీ కమాండర్గా తక్కువ కాలంలో ఎదగడమే- రాగో గిరిజన లోకానికి అందించిన మార్పు.
Similar books
Folklore in Baltic history: resistance and resurgence
2019 · PDF
క్రీస్తు కొరకు చిత్రహింస / Tortured for Christ
1986 · PDF
బైబిల్
A Telugu-English Dictionary
1991 · PDF
The Holy Bible: New Testament in Telugu
The Naked Mughals - Forbidden Tales of Harem and Butchery
Telugu Bible - The Holy Bible Telugu OV - పరిశుద్ధ గ్రంథము
1880 · PDF
Viswa Kosam (viswa prakasam) Sanskrit Telugu Dictionary
1996 · PDF